జన్నారం ఏటీసీ కళాశాలలో విజయవంతంగా ముగిసిన రోబోటిక్స్ ప్రాక్టికల్ పరీక్షలు

జన్నారం మండలంలోని ప్రభుత్వ ఏటీసీ కళాశాలలో సోమవారం నిర్వహించిన రోబోటిక్స్ విభాగం ప్రాక్టికల్ పరీక్షలు ప్రశాంతంగా, విజయవంతంగా ముగిశాయి. సుమారు 37 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరై తమ ప్రాక్టికల్ నైపుణ్యాలను ప్రదర్శించారు. కళాశాల యాజమాన్యం ముందస్తుగా అన్ని ఏర్పాట్లు చేయడంతో పరీక్షలు ఎలాంటి అంతరాయం లేకుండా సజావుగా సాగాయి. అధ్యాపకులు పరీక్షలను పారదర్శకంగా నిర్వహించి విద్యార్థులకు అవసరమైన సూచనలు అందించారు. పరీక్షల నిర్వహణపై అధికారులు సంతృప్తి వ్యక్తం చేయగా, విద్యార్థులు కూడా పరీక్షలు విజయవంతంగా పూర్తిచేశారు.